పాఠ్య ప్రణాళిక/పీరియడ్ పథకం

3. పీరియడ్ పథక ప్రయోజనాలు

పాఠ్యాంశం ద్వారా సాధించాల్సిన లక్ష్యాలను ముందుగా స్పష్టంగా ఏర్పరచవచ్చు.
నిర్ణయించుకున్న లక్ష్యాలను తక్కువ శ్రమతో సులభంగా పాఠ్యబోధన ద్వారా సాధించవచ్చు.
పాఠ్యాంశ విషయాలను తార్కికంగాను, క్రమబద్ధంగాను బోధించవచ్చు.
ఉపాధ్యాయుడు ఆత్మ స్థైర్యంతో, ఆసక్తిగా పాఠ్యాంశాన్ని బోధిస్తాడు.
అందుబాటులో ఉన్న వనరులు, పరికరాలతో బోధనను చక్కగా కొనసాగిస్తారు.
పాఠ్యాంశ బోధనకు పూర్వం, బోధించే సమయంలో, బోధన పూర్తయిన తర్వాత చేయవలసిన అంశాలను (నియోజనాలు, మూల్యాంకన ప్రశ్నలు, కృత్యాలు) క్రమబద్ధంగా తయారు చేసుకోవచ్చు.
సమయం వృథాకాకుండా బోధించవచ్చు.
ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధనకు మానసికంగా సిద్ధమవుతూ, సందర్భోచిత ఉదాహరణలు, దృష్టాంతాలు, కృత్యాలు ఎన్నుకొని ఉపయోగించగలడు.
ఉత్తమ పాఠ్య ప్రణాళికకుండవలసిన లక్షణములు:
1. సాధించవలసిన లక్ష్యములు స్పష్టముగాను, నిర్ధేశించిన సమయంలో బోధన పూర్తి అయ్యేవిగాను ఉండాలి.
2. లక్ష్యములు సాధింపబడినది, లేనిది ఖచ్చితముగా తెలుసుకొనుటకు తగిన మూల్యాంకన పద్ధతులు నిర్దేశించబడాలి.
3. పూర్వజ్ఞానము ఆధారముగా నిర్మించబడాలి.
4. బోధనా ప్రక్రియలో జరిగే రూపణ మూల్యాంకనము విద్యార్థుల నిత్యజీవిత అనుభవాలపై ఆధారపడి ఉండాలి.
5. అందుబాటులో నుండే వనరులను బోధనోపకరణములుగా పూర్తి స్థాయిలో ఉపయోగించుకొనేటట్లు ఉండాలి.